డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో హిందూ, ముస్లిం గొడవలా?
కులం, మతంతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి పారదర్శకంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. ఈ నెల 21న రెండో విడతగా మరో 13,400 ఇళ్లను కేటాయించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. ఈ విషయంలో ప్రజలంతా విజ్ఞతతో వ్యవహరించాలని మంత్రి సబిత కోరారు. రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.