తెలంగాణ కాంగ్రెస్‌లో ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ గొడవ?

Chakravarthi Kalyan
రాష్ట్ర శాసనసభకు రాబోయే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికలో ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను ఫ్రేమ్‌వర్క్‌గా తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటున్నారు. గతంలో మూడుసార్లు అంతకంటే ఎక్కువ సార్లు ఓడిపోయిన నాయకులకు టిక్కెట్లు ఇవ్వవద్దని సూచిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ కేటాయింపుపై కసరత్తు జరుగుతున్న సందర్భంలో కోదండరెడ్డి పలు సూచనలు చేశారు. పార్టీలో ఇటీవల చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి ఒకరిద్దరికి తప్పా కొత్తగా చేరినవాళ్లకు టిక్కెట్లు ఇవ్వవద్దని కోదండరెడ్డి తెలిపారు.


2018 శాసనసభ ఎన్నికల్లో  ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన వారికి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్లు ఇవ్వవద్దని కోదండరెడ్డి అన్నారు. పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా యువత, యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోదండరెడ్డి పేర్కొన్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న, అధికార బీఆర్‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ కిసాన్ కాంగ్రెస్‌కు కనీసం 3 టిక్కెట్లు ఇవ్వాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: