ఉత్తరాంధ్ర చరిత్రలో నవశకం ప్రారంభం?
ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గిరిజన ప్రాంతంలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూమిని సేకరించారు. అందులోనూ విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి... విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా ఈ వర్శిటీ స్థలాన్ని ఎంపిక చేయడం విశేషం.