ఎన్నో ఏళ్ల కల సాకారం చేస్తున్న జగన్‌?

Chakravarthi Kalyan
ఏపీలో సీఎం జగన్‌.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న అసైన్డ్‌ భూమికి ఆ సాగుదారుడ్నే యజమానిని చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. నాలుగేళ్ల పాల‌న‌లో రెవెన్యూ వ్యవ‌స్థలో అనేక సంస్కర‌ణ‌లు తీసుకువ‌చ్చిన సీఎం జగన్.. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల‌న భూ యజమానుల గౌరవం పెంచుతున్నారు.


ప్రావిజ‌న్ ఆఫ్ ట్రాన్సఫ‌ర్స్ యాక్ట్  ప్రకారం.. చట్టం తెలియక భూమి కొన్నా, అమ్మినా  ఆ భూమిపై హ‌క్కుల‌న్నవి హ‌క్కుదారుల‌కే ద‌క్కాలి అన్న ఉద్దేశంతో ఇర‌వై ఏళ్ల సాగులో ఉన్నవారికి హ‌క్కులు ద‌ఖ‌లు పరుస్తూ వారి ప‌రిధిలో ఉన్న అసైన్డ్ ల్యాండ్ ను అమ్ముకునే వీలు క‌ల్పించింది జగన్‌ సర్కారు. 1977 నాటి పీఓటీ యాక్ట్ కు కొన్ని నిబంధ‌న‌లు స‌డ‌లించి ల‌బ్ధిదారులకు భూమిపై హ‌క్కు క‌ల్పిస్తున్నారు. దీని ద్వారా  20 ఏళ్లు నిండి ఉంటే చాలు ఆ భూమి మీద పూర్తి హక్కుతో అమ్ముకునే అవకాశం దక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: