టీడీపీకి పుంగనూరు షాక్‌.. పోలీసులే కేసులు పెట్టారు?

Chakravarthi Kalyan
పుంగనూరు, అంగళ్ల ఘటనలో పోలీసులు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 164 తెలుగుదేశం శ్రేణులపై హత్యాయత్నం, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. పోలీసులే ఫిర్యాదుదారులుగా వివిధ సెక్షన్ల కింద 4కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది. ఇన్స్పెక్టర్ నెల్లి భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసులో పుంగనూరు తెలుగుదేశం ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తో పాటు మరో 39 మంది తెలుగుదేశం కార్యకర్తలు, ఇతరులపై కేసు నమోదు చేశారు.

అలాగే జయశంకర్ అనే కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసులో చల్లా రామచంద్రారెడ్డి తో పాటు మరో 16 మంది తెదేపా కార్యకర్తలు, ఇతరులపై కేసు నమోదు చేశారు. మరో పోలీసు అధికారి నాగరాజా ఫిర్యాదుతో చల్లా రామచంద్రారెడ్డి తో పాటు 19 మంది తెలుగుదేశం క్యాడర్ పై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పాలసముద్రం ఎస్సై బి ప్రసాద్ ఫిర్యాదుతో  చల్లా రామచంద్ర రెడ్డి తో పాటు మరో 37 మంది టీడీపీ కార్యకర్తలతో పాటు ఇతరులపై హత్యాయత్నం, వివిధ సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: