కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న ఈటెల.. కానీ?

Chakravarthi Kalyan
ఆర్టీసీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు అని చెప్పిన కేసిఆర్.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తిచడాన్ని భాజపా స్వాగతిస్తోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. భాజపా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించడం ఇష్టం లేదని తప్పుడు ప్రచారం సిఎం కేసిఆర్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. గవర్నర్ అందుబాటులో లేరని చెప్పారని.. కావాలని బట్ట కాల్చి గవర్నర్ మీద వేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు.

ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందన్నఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. ఆర్టీసీ ఉద్యోగుల రెండు PRC లు బాకీ ఉన్నాయన్నారు. బలవంతంగా ఆర్టీసీ ఉద్యోగులను బస్సులో ఎక్కించి రాజ్ భవన్ పంపుతున్నారని.. ఆర్టీసీ కార్మికులు ఎంతో చైతన్య వంతులని.. వారిని తప్పు త్రోవ పట్టిస్తున్నారని వారికి తెలుసని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను నిజాలు గ్రహిస్తారని ఈటల అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: