వచ్చే ఎన్నికల్లో జగన్‌ స్కోరు ఇదే.. మాజీ మంత్రి అంచనా?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌ అధికారం కోల్పొపోవడం ఖాయమంటున్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌. ఆంధ్రాలో 175 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ కి కేవలం 10 నుంచి 15 స్థానాలు వస్తాయని, పార్లమెంట్‌  స్థానాల్లో కాంగ్రెస్‌కు 20కి పైగా సీట్లు వస్తాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌ అన్నారు. జగన్‌ పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే ఓడిపోతారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌ పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 150 సీట్ల కంటే ఎక్కువ రావాలని.. కాంగ్రెస్‌ కూటమికి  300లుకు పైగా సీట్లు వస్తాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌ అన్నారు. గత పదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితులకు చేసింది ఏమి లేదని...ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: