విశాఖ స్వామీజీ కామలీలలు నిజమే..?

Chakravarthi Kalyan
విశాఖ జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకుడు పూర్ణానంద స్వామీజీ కేసులో కీలక మలుపు తిరిగింది. పూర్ణానంద స్వామీజీ బెయిల్ పిటిషన్ ను పోక్సో కోర్టు  కొట్టేసింది. ఈ నెల మొదటి వారంలో జరిగిన టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ లో స్వామీజీ మూడు సార్లు బాధితులు గుర్తు పట్టారు. అందువల్ల ఇద్దరు మైనర్ ల పై లైంగిక దాడి జరిగినట్టు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది.  


స్వామీజీ తరుపు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. అయితే.. పూర్ణానంద స్వామీజీ పై అన్ని ఆధారాలు వ్యతిరేకంగా ఉన్న తరుణంలో బెయిల్ మంజూరు చెయ్యడం ప్రమాదమని వాదించిన పోక్సో స్పెషల్  పీపీ కరణం కృష్ణ వాదించారు. పోక్సో స్పెషల్  పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ  వాదనలు విన్న తరువాత.. పోక్సో స్పెషల్  పీపీ కరణం కృష్ణ వాదనలతో కోర్టు  ఏకీభవించింది. పూర్ణానంద స్వామీజీ బెయిల్ పిటిషన్ ను పోక్సో కోర్టు కొట్టివేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: