తెలంగాణలో దొంగ ఓట్ల కలకలం?

Chakravarthi Kalyan
తెలంగాణలోని బోగస్ ఓట్లపై వెంటనే విచారణ చేసి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. నాంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ ఫిరోజ్ ఖాన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి, కాంగ్రెస్ ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌.. వికాస్‌ రాజ్‌కు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు.

ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే లక్షా 13వేల దొంగ ఓట్లు ఉన్నట్లు వికాస్‌రాజ్‌కు వారు వివరించారు. అన్ని నియోజకవర్గాలల్లో దొంగ ఓట్లపై కాంగ్రెస్ శ్రేణులు దృష్టి సారించాలని కాంగ్రెస్ నేతలు సూచించారు. నాంపల్లి నియోజకవర్గంలో 273 పోలింగ్ బూత్స్ వుంటే కేవలం 130 మంది బి.ఎల్.ఓ లు మాత్రమే వున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోకపోతే పోరాటం చేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: