ఈనెల 28న వాళ్ల ఖాతాల్లోకి జగన్ డబ్బులు?
తాజాగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లులు పథకానికి అర్హులుగా ఉంటారు. పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేలు మించకూడదని ఉత్తర్వుల్లో చెప్పారు. అదే పట్టణాల్లో రూ.12 వేలుకు మించకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అలాగే పదో తరగతి తర్వాత కూడా ప్రభుత్వ సొమ్ము వారికి వస్తుంది. అది ఎలాగంటే.. ఇంటర్మీడియెట్ కాకుండా పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వంటి కోర్సుల్లో చేరే వారికి జగనన్న విద్యాదీవెన రూపంలో అందిస్తారు. అలాగే వసతి దీవెన పథకాలను కూడా వీరికి అమలు చేస్తారు.