లోకేశ్‌ ఆ మాటలు చెబుతుంటే భలే నవ్వొస్తుందట?

Chakravarthi Kalyan
నారా లోకేశ్‌కు.. ఏ పంట ఎక్కడ పండుతుందో కనీస పరిజ్ఞానం లేదని.. ఆయన వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. టీడీపీ హయాంలో సాగు, తాగునీరు లేదన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి..  చంద్రబాబు అధికారంలోకి ఉంటే కరువు కటకాలు విలయతాండవం చేస్తాయని అన్నారు. బాబు హయాంలో ప్రతి ఏటా కరువు మండలాలు ప్రకటించారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదన్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. అసలు  యువగళానికి స్పందనే లేదన్నారు. సోమశిల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ తీసుకొస్తామని చెబుతున్న లోకేష్‌.. చంద్రబాబు హయాంలో ఎందుకు చేయలేకపోయారో చెప్పాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతు రథం పేరుతో కమీషన్లు కొల్లగొట్టింది నిజం కాదా అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: