జగన్: 4 ఏళ్లలో ఆ కులాలకు రూ. రూ.53,919 కోట్లు?
దళితులు అందరూ ఐక్యంగా ఉండి మళ్ళీ మళ్లీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పని చేయాలని జూపూడి ప్రభాకర్ కోరారు. వైయస్ఆర్ సిపి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికోట్టాలని జూపూడి ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి ఎస్సీ మహాసభ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయ్యాలి అన్నదాని పై నేతలు చర్చించారు. మెజారిటీ నాయకులు విజయవాడలో ఏర్పాటు చెయాలని కోరారని జూపూడి ప్రభాకర్ తెలిపారు.