చంద్రబాబు రహస్యాలపై సంచలన పుస్తకం?
టీడీపీ మేనిఫెస్టో అంతా మోసపూరిత హామీలేని నందమూరి లక్ష్మీ పార్వతి విమర్శించారు. పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గతంలో చంద్రబాబు ప్రచారం చేసిన విషయాన్ని నందమూరి లక్ష్మీ పార్వతి గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో గురించి ఏమంటారని నందమూరి లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే ఆర్బీఐ సొమ్ము కూడా చాలదని లక్ష్మీపార్వతి ఎద్దేవా చేశారు. ఇక నారా లోకేష్ది పాదయాత్ర కాదని.. అది ఈవినింగ్ వాక్ అని నందమూరి లక్ష్మీ పార్వతి ఎద్దేవా చేశారు. మరి తాజా పుస్తకంలో ఆమె ఎన్ని సంచలనాలు బయటపెట్టారో?