వివేకా హత్య.. ఆ మీడియా వైఖరి దారుణం?

Chakravarthi Kalyan
వివేకా కేసులో సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారు. విచారణను పక్కదారి పట్టించేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎల్లోమీడియా చర్చలు పెట్టిందని వైసీపీ నాయకులు దుయ్యబట్టారు. సీఎం వైయ‌స్ జగన్‌ను ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని, వ్యవస్థను కించపరిచేలా ఒక మూకలా తయారై దుష్ప్రచారం చేశారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు ఎల్లో మీడియా పరిధులు దాటి వ్యహరిస్తోందని వైసీపీ నాయకులు విమర్శించారు. చివరకు జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని వైసీపీ నాయకులు అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్‌, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసేలా చర్చలు చేపట్టిందని వైసీపీ నాయకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: