ఈనెల 27న హైదరాబాద్‌లో అద్భుత కార్యక్రమం?

Chakravarthi Kalyan
సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా ఈ నెల 27న యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. జూన్ 21కీ వంద రోజుల ముందే యోగా కౌంట్ డౌన్ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశానుసారం 25 రోజుల కౌంట్ డౌన్ ను ఈ నెల 27న హైదరాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అన్నారు.

యోగా కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు రాబోతున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, గవర్నర్ కు అహ్వాన లేఖలు పంపామని కిషన్ రెడ్డి  తెలిపారు. ముఖ్యమంత్రి వచ్చి పరేడ్ మైదానంలో యోగా చేస్తారని ఆశిస్తున్నట్లు కిషన్ రెడ్డి  తెలిపారు. వ్యక్తి యొక్క మానసిక పరివర్తనకు యోగా ఎంతో దోహదం చేస్తుందన్న కిషన్ రెడ్డి .. హైదరాబాద్ నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: