బీఎస్సీ సభ సక్సస్‌.. ఆ డబ్బులు ఎక్కడివి?

Chakravarthi Kalyan
బీఎస్పీ సభకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ చెబితే మంచిదని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. ప్రవీణ్‌ సత్తా ఏమిటో మునుగోడు ఉప ఎన్నికలో తేలిపోయిందని గువ్వల బాలరాజు అన్నారు. రాజకీయాల్లో మాయావతి శకం ముగిసిందని.. కేసులకు భయపడి మాయావతి బీఎస్పీని బీజేపీకి తోక పార్టీగా మారిందని గువ్వల బాలరాజు దుయ్యబట్టారు.

సరూర్‌నగర్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాయావతి బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేదని గువ్వల బాలరాజు  ఆక్షేపించారు. మాయావతి తీరు చూసి కాన్షీరాం ఆత్మ కూడా క్షోభిస్తుందని.. దళితులకు ఆమె ద్రోహం చేస్తున్నారని గువ్వల బాలరాజు మండిపడ్డారు. బీఎస్పీ రాష్ట్ర నేత ప్రవీణ్‌కుమార్ పై కేసీఆర్‌ కొండంత నమ్మకముంచి గురుకులాల సోసైటీ కార్యదర్శిగా ఆరేళ్లు అవకాశం కల్పించారని.. ఆయన పదవీని దుర్వినియోగం చేసి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని గువ్వల బాలరాజు  ధ్వజమెత్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

bsp

సంబంధిత వార్తలు: