కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే ఇచ్చేస్తారట?

Chakravarthi Kalyan
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే... కేసీఆర్ సర్కారు గుంజుకున్న భూములను తిరిగి పేదలకు అధికారికంగా పట్టాలు ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇచ్చిన 10వేల ఎకరాలు దాదాపు 5లక్షల కోట్లు విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం లాక్కుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారి హామీ ఇస్తే దానిని వందకు వంద శాతం అమలు చేసి తీరతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సరూర్‌ నగర్‌ వేదికగా సోనియా గాంధీ ప్రకటించే యువ డిక్లరేషన్‌ కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  తెలిపారు. యాభై రోజులకుపైగా పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌ పేటలో పర్యటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: