త్వరలో.. కూకట్పల్లిలో కళ్లు చెదిరే ఆధ్యాత్మిక కేంద్రం?
ఉదాసీన్ మఠం ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం శాంతినివాస్, వేద పాఠశాల, యాగశాల, గోశాలతో సహా ప్రజలకు ఉపయోగపడే అనేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్థలం గతంలో కోర్టు వివాదంలో ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు 540 ఎకరాలు ఉదాసీన్ మఠ్ కు చెందినవేనని తీర్పు ఇవ్వడంతో వై జంక్షన్ లోని భూములు స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఉదాసీన్ మఠ్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించింది.