నీరా.. స్వామీజీలు తాగారు.. అందరూ తాగొచ్చా?
త్వరలో నీరా ఐస్క్రీం, తాటి ముంజల ఐస్క్రీం ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా నీరా శుద్ధి యంత్రాలను మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చిన స్వామీలు నీరా తాగారు. స్వచ్ఛమైన నీరాలో సున్న శాతం ఆల్కహాల్ ఉన్న దృష్ట్యా పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు సేవించినా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. నీరా వేదామృతం అని శ్రీనివాస్గౌడ్ అన్నారు.