గుడ్‌న్యూస్‌: రేపటి నుంచి స్పెషల్‌ పాస్‌పోర్టు డ్రైవ్‌?

Chakravarthi Kalyan
తెలంగాణలో ఏప్రిల్‌ 29 నుంచి ప్రత్యేకంగా పాస్‌పోర్టు డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. డిమాండ్‌ అధికంగా ఉండడంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు దాసరి బాలయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకిలతోపాటు కరీంనగర్‌, నిజామాబాద్‌లలో ఈ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు దాసరి బాలయ్య వివరించారు. ఈ నెల 29వ తేదీన మొదలయ్యే ప్రత్యేక డ్రైవ్‌ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుందని దాసరి బాలయ్య అన్నారు.

తత్కాల్‌, సాధారణ, పీసీసీ క్యాటగిరిలకు చెంది 3056 అపాయింట్‌మెంట్లను ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదల చేశామని దాసరి బాలయ్య  తెలిపారు. అపాయిట్మెంట్లు దొరకక పెండింగ్‌లో ఉన్న 3056 అపాయింట్‌మెంట్లుకు చెందిన ధరఖాస్తుదారులు 29వ తేదీన స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: