బండి సంజయ్‌ ఫోన్‌లోనే ఆ సీక్రెట్ ఉందా?

Chakravarthi Kalyan
బండి సంజయ్‌ బెయిల్ వచ్చినంత మాత్రాన తప్పు చేయనట్లు కాదని.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. విజయోత్సవ ర్యాలీలు ఎందుకు చేస్తున్నారని..  విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేయడమేంటని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు. బండి సంజయ్ తప్పు చేశారు కాబట్టే ఫోన్ ఇవ్వటం లేదని.. రెండు ప్రశ్నపత్రాల లీకేజీల్లోనూ బండి సంజయ్ పాత్ర ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. సంజయ్ కుట్ర పన్నినట్లు సాక్ష్యాలు ఉన్నాయని.. ఎన్ని పాపాలు చేసయినా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు.

భాజపాకు రాజ్యంగంపై నమ్మకం లేదన్న మంత్రి ఎర్రబెల్లి.. ప్రశ్నపత్రాల లీకేజీ వెనక దిల్లీ భాజపా నేతల హస్తముందని.. రాష్ట్ర నాయకులు కేవలం నటులు మాత్రమేనని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు. భాజపా కార్యాలయం అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని.. కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవటం ద్వారా భాజపా తెలంగాణకు వ్యతిరేకమని అర్థమవుతోందని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: