తెలంగాణ ఆత్మగౌరవం.. మద్యం బాటిళ్లకు తాకట్టా?

Chakravarthi Kalyan
తెలంగాణ గౌరవాన్ని తీసుకెళ్లి డిల్లీలో మద్యం బాటిళ్లకు తాకట్టు పెట్టారనీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలు సాధించినట్లు ఎన్ని ఫోన్లు వాడింది చూపించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. భాజపాకు వ్యతిరేకంగా ఉన్న కుటుంబ పార్టీలకు కేసీఆర్ డబ్బులు ఇస్తా, చైర్మెన్ గా ఉంటాననీ చెప్పినట్లు ప్రసార మాధ్యమాల్లో చుశానని.. దేశంలోనీ అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నాడంటే.. భారాస సర్కారు ఎన్ని వేల కోట్ల సంపాదించిందో అర్ధమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ కు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలనీ డిమాండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేశారు. ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రాబోతున్నారని.. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్ నిర్మాణ పనులను మోదీ ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: