మంత్రి కొప్పుల.. ఆ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారా?

Chakravarthi Kalyan
మాల, మాదిగ కులాల మధ్య చిచ్చు పెడుతున్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను భర్తరఫ్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు దళిత సంఘాలు హైదరాబాద్ ఆందోళనకు దిగాయి. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మంత్రి కొప్పులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దళిత సంఘాల నేతలు నిరసనను తెలిపారు. రాష్ట్ర ప్రతి ఏటా నిర్వహించే బాబు జగ్జీవన్ రాం, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీను మంత్రి తనకు అనుకూలంగా వ్యవహరించే వారికే కట్టబెట్టారని దళిత సంఘాల నేతలు ఆరోపించారు.
ఒకసారి కమిటీ ఛైర్మెన్ గా పనిచేసిన వారికి మరోసారి అవకాశం ఇవ్వకూడదని... ఉమ్మడి రాష్ట్రంలో నుండి  వస్తున్న ఆనవాయితీని మంత్రి పక్కన పెట్టారని దళిత సంఘాల నేతలు తెలిపారు. అన్ని కులా సంఘాలకు సమాన అవకాశాలు ఇవ్వకుండా వివక్ష చూపుతున్న... మంత్రి కొప్పుల ఈశ్వర్ ను భర్తరఫ్ చేసి... ఉత్సవ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ వేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 5న మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటిని ముట్టడిస్తామని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: