ఆస్కార్ అవార్డు కోసం
ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం 80 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసిందని ప్రముఖ దర్శక
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు. ఆ డబ్బుతో మరో 8 చిత్రాలు నిర్మించవచ్చని
తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో,
సినిమా వ్యాపారంలో సామాజిక స్పృహా లోపించిందన్న
తమ్మారెడ్డి భరద్వాజ .. ఇప్పుడు ఎక్కువ మంది దర్శకులు తమ తృప్తి కోసమే సినిమాలు తీస్తున్నారన్నారు. సమాజంలో మార్పును ఆశిస్తూ సినిమాలు తీయడం లేదని
తమ్మారెడ్డి భరద్వాజ ఎద్దేవా చేశారు.
రాజమౌళి
ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు తీయాలని చాలా మంది ఆశిస్తారని, కానీ చివరకు సాధారణ సినిమాగానే ఉంటుందని
తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు రాజేశ్ టచ్ రివర్ సారథ్యంలో
హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైడి జయరాథ్ ప్రివ్యూ
థియేటర్ లో వివాదాస్పద విషయాలపై సినిమాల నిర్మాణం అనే అంశంపై చర్చా కార్యక్రమంలో
తమ్మారెడ్డి భరద్వాజ ఈ వ్యాఖ్యలు చేశారు.