మాజీ మంత్రి నారాయణ కూతురుకు ఊరట?

Chakravarthi Kalyan
మాజీ మంత్రి నారాయణ కుమార్తె సింధూరకు ఊరట లభించింది. మాజీ మంత్రి నారాయణ కుమార్తె సింధూరను ఇంటి వద్దనే విచారించాలని సిఐడీ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద నారాయణ కుమార్తె అల్లుడికి నోటీసులు సిఐడీ జారీ చేసింది. అయితే.. తమను విచారణకు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు ఇచ్చిందని హైకోర్టును నారాయణ కుమార్తె , అల్లుడు ఆశ్రయించారు. వీరి తరపున వాదనలు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వినిపించారు.

సిందూరను ఈ నెల 20వ తేదీన ఇంటి వద్దే విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిందూర భర్త పునీత్ , అతని సోదరుడు వరుణ్‌ కుమార్ లను సీఐడీ కార్యాలయంలో విచారించవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఇదే కేసులో రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీ కుమార్ ను న్యాయవాది సమక్షంలో విచారించాలని సిఐడీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: