ఇక జగనే.. వైసీపీ భవిష్యత్తా?

Chakravarthi Kalyan
వైసీపీ కొత్తగా నిర్వహించ తలపెట్టిన  పార్టీ కార్యక్రమం 'జగనన్నే మా భవిష్యత్తు'.. పేరు చాలా వెరైటీగా ఉంది కదా.. మార్చి 18 నుంచి 26 వరకూ కూడా 'జగనన్నే మా భవిష్యత్తు' క్యాంపెయిన్‌ నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. వైసీపీ పార్టీకి చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు డోర్‌ టు డోర్‌ ఈ కార్యక్రమాన్ని  నిర్వహిస్తారట. గత ప్రభుత్వం కన్నా.. ఈ ప్రభుత్వం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తారట.
గృహసారథులను కో–ఆర్డినేట్‌ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు ఈ కార్యక్రమం అప్పగిస్తారట. సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపేణా వైకాపాకు సుమారు 5.65 లక్షలమందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉందని భావిస్తున్నా పార్టీ పెద్దలు.. వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతున్నారు. వీరంతా దాదాపు 1.65 కోట్ల గృహాలను సందర్శించాలని చెబుతున్నారు. ఈ కార్యక్రమం ఎంత వరకూ సక్సస్‌ అవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: