హరీశ్రావుతో జగ్గారెడ్డి.. అడిగింది ఇవేనట?
సంగారెడ్డి పట్టణంలోనే ముస్లిం ల స్మశానవటిక కొరకు 5 ఎకరాల భూమి కావాలని.. ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా భూమి కేటాయించాలని.. అలాగే సంగారెడ్డి పట్టణంలో హిందువుల స్మశానవటిక కోసం 5 ఎకరాల భూమి కావలని.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఇక క్రిస్టియన్స్ కోసం కూడా సంగారెడ్డి పట్టణంలో 5 ఎకరాల స్మశానవటిక కోసం కేటాయించాలని.. సదశివాపేట్ లో మెహబూబ్ పాషా దర్గా అభివృద్ధి కోసం 3కోట్లు మంజూరు చేయాలనీ ప్రభుత్వాన్నీ కోరారట ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాగే సదశివాపేట్ లో ముస్లిం ఈద్ గా అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించాలని కోరారట.