హరీశ్‌రావుతో జగ్గారెడ్డి.. అడిగింది ఇవేనట?

Chakravarthi Kalyan
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి హరీష్ రావు ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఎన్ ఆర్ ఈ జీ ఎస్ స్కీమ్ కింద 5 కోట్ల 50 లక్షల నిధులు ఇవ్వాలని.. సంగారెడ్డి పట్టణంలోని ఫతే ఖాన్ దర్గా అభివృద్ధి కోసం 3 కోట్లు ఇవ్వాలని.. సంగారెడ్డి పట్టణం ఈద్ గా అభివృద్ధి కోసం ప్రభుత్వం 5 కోట్లు ఇవ్వాలని.. సంగారెడ్డి పట్టణంలోని దీన్ దార్ ఖాన్ ఫంక్షన్ హాల్ అభివృద్ధి కోసం 5 కోట్ల నిధుల కోసం కలిశామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.
 
సంగారెడ్డి పట్టణంలోనే ముస్లిం ల స్మశానవటిక కొరకు 5 ఎకరాల భూమి కావాలని.. ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా భూమి కేటాయించాలని.. అలాగే సంగారెడ్డి పట్టణంలో హిందువుల స్మశానవటిక కోసం 5 ఎకరాల భూమి కావలని.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఇక క్రిస్టియన్స్ కోసం కూడా సంగారెడ్డి పట్టణంలో 5 ఎకరాల స్మశానవటిక కోసం కేటాయించాలని.. సదశివాపేట్ లో మెహబూబ్ పాషా దర్గా అభివృద్ధి కోసం 3కోట్లు మంజూరు చేయాలనీ ప్రభుత్వాన్నీ కోరారట ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అలాగే సదశివాపేట్ లో ముస్లిం ఈద్ గా అభివృద్ధి కోసం 3 కోట్లు కేటాయించాలని కోరారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: