విశాఖకు ఐటీ కళ.. అక్టోబర్ నుంచి ఇన్ఫోసిస్?
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అక్టోబర్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో మొదలు పెట్టి క్రమంగా 3 వేల మందికి ఉద్యోగాలు విస్తరించనున్నారు. మరో ప్రముఖ ఐటీ సంస్థ డల్లాస్ టెక్నాలజీస్ సెంటర్ కూడా తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని మంత్రి తన పోస్టులో తెలిపారు. సో.. విశాఖ ఏపీకి రాజధాని అయినా.. కాకపోయినా.. విశాఖ ప్రగతి విశాఖదే.