పాదయాత్ర కాదు.. అది అసమర్థుని అంతిమయాత్ర!?

Chakravarthi Kalyan
అమరావతి రైతుల రెండో విడత పాదయాత్రపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఉత్తరాంధ్ర పై అమరావతి రైతులు చేస్తున్నది అసమర్ధుని అంతిమయాత్ర అని వర్ణించారు. అమరావతిలో 29 గ్రామాలు తప్ప రాష్ట్రంలో ఎవరికి సంబంధం లేదని  స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్ గా కాదు ఉత్తరాంధ్ర పౌరుడిగా మాట్లాడుతున్నానన్న  స్పీకర్ తమ్మినేని సీతారాం.. ప్రజలను రెచ్చగొట్టడానికి యాత్ర చేస్తే ఎవరు అనుమతిస్తారన్నారు.

శాంతి భద్రతల సమస్య వస్తే చంద్రబాబు బాధ్యత వహించాలన్న  స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఉత్తరాంధ్రకి రాజధాని వస్తే  అభివృద్ధి చెందుతామన్నారు. మూడు రాజధానులు కడితే చంద్రబాబు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించిన  స్పీకర్ తమ్మినేని సీతారాం.. ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన హామీలు 98.44శాతం అమలుపరిచారని కితాబిచ్చారు. కళ్యాణమస్తు, షాధీ తోఫా పథకాలను ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అభినందించానని  స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కళ్యాణమస్తు, షాధీ తోఫా పథకాలు పొందాలంటే వధూవరులు ఇద్దరు 10 వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలని  స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: