తెలంగాణకు మళ్లీ అమిత్ షా.. రచ్చ తప్పదా?
ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే కూడా రాబోతున్నారు. సెప్టెంబర్ 17న నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కమల దళం చర్చించనుంది. దీని కోసం ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో తరుణ్ చుగ్ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మాత్రం విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. ఇప్పుడు ఇదే అంశాన్ని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ విషయంలో టీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.