జగన్ బటన్ నొక్కుతున్నా.. ఆత్మహత్యలెందుకు?
కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కడప జిల్లాలో పర్యటిస్తారు. సిద్ధవటంలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని పవన్ కల్యాణ్ అందజేస్తారు. అక్కడే బహిరంగ సభలో ప్రసింగిస్తారు. జన సైనికులు పర్యటన విజయవంతం చేయాలని మనోహర్ కోరారు. గత ఏడాది రాజంపేట, నందలూరులో వరదలు వస్తే జన సైనికులే ముందుగా అక్కడికి వెళ్లి బాధితులను పలకరించారని మనోహర్ గుర్తు చేశారు.