భారత్, అమెరికాలకు చైనా షాక్?
అబ్దుల్ రౌఫ్ అజార్ పేరును అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని భారత్, అమెరికా యత్నించాయి. అతడి ఆస్తులను స్తంభింపజేయడం, ప్రయాణాలపై నిషేధం వంటి ఆంక్షలు విధించాలని అమెరికా, భారత్ కోరుతున్నాయి. ఈ మేరకు ఐరాసలో ప్రతిపాదన పెట్టాయి. ఐరాస భద్రతా మండలిలో 15 సభ్య దేశాల్లో 14 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించినా ఒక్క చైనా మాత్రం దీన్ని ఆపేసింది. చైనా ఈ ప్రతిపాదనను హోల్డ్ లో పెట్టడం వల్ల అబ్దుల్ రౌఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ఆలస్యం కానుంది.