ఇవాళ ఆ కులస్తుల ఖాతాల్లో డబ్బులు వేయనున్న జగన్..?

Chakravarthi Kalyan
సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు వేయడం అన్నది కనీసం నెలకోసారి అయినా ఉంటూనే ఉంటుంది. ఇవాళ కూడా సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు వేయనున్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సాయం డబ్బులు ఖాతాల్లో వేయబోతున్నారు. సీఎం జగన్ దీని కోసం ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.

కాకినాడ‌లోని గొల్లప్రోలులో వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సాయం అందిస్తారు. ఈమేరకు కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కి డబ్బులు విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని త‌న నివాసం నుంచి కాకినాడ బయలుదేరతారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు. 10.45 గంట‌ల నుంచి 12.15 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత కాపు నేస్తం పథకం సహాయం డబ్బులు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మళ్లీ తాడేపల్లికి సీఎం చేరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: