ఇవాళ ఆ కులస్తుల ఖాతాల్లో డబ్బులు వేయనున్న జగన్..?
కాకినాడలోని గొల్లప్రోలులో వైయస్ఆర్ కాపు నేస్తం పథకం మూడో విడత సాయం అందిస్తారు. ఈమేరకు కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి కాకినాడ బయలుదేరతారు. సీఎం వైయస్ జగన్ 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 12.15 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత కాపు నేస్తం పథకం సహాయం డబ్బులు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మళ్లీ తాడేపల్లికి సీఎం చేరుకుంటారు.