ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ గుడ్‌ న్యూస్..?

Chakravarthi Kalyan
మోడీ సర్కారు కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.  నష్టాల్లో ఉన్న ప్రభుత్వ టెలికాం సంస్థ-బీఎస్‌ఎన్‌ఎల్ కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. ఏకంగా లక్షా 64వేల కోట్ల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలు వెల్లడించారు.
బీఎస్‌ఎన్‌ఎల్ .. సేవలను మెరుగుపరచడం, బ్యాలెన్స్‌ షీట్‌పై భారాన్ని తగ్గించడం, ఫైబర్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడం కోసం ఈ ప్యాకేజీని ప్రకటించారు. 4G సేవలను అందించడానికి బీఎస్‌ఎన్‌ఎల్ కు అవసరమైన స్పెక్ట్రమ్ పరిపాలనా కేటాయింపులను ప్రభుత్వం చేయనుంది. ఈ విషయాన్ని కూడా అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. బీఎస్‌ఎన్‌ఎల్ కు 5g స్పెక్ట్రమ్‌ను కూడా అందించనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్  బ్యాలెన్స్‌ షీట్‌పై భారాన్ని తగ్గించేందుకు 33 వేలకోట్ల బకాయిలను ఈక్విటీలుగా మారుస్తారు. అంతే కాదు తక్కువ వడ్డీతో బాండ్లు జారీ చేసి బ్యాంకు రుణాలను చెల్లిస్తారు. అంతే కాదు.. బీబీఎన్‌ఎల్‌ ను కూడా Bబీఎస్‌ఎన్‌ఎల్ లో విలీనం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: