ఆ ఎన్నికల సందడి మొదలైంది..అన్ని పార్టీలు రెడీ..?

Chakravarthi Kalyan
దేశంలో ఆ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఏ ఎన్నికలు అంటారా.. అవే రాష్ట్రపతి ఎన్నికలు.. ఈ నెల 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంట్ సభ్యులు అంతా దిల్లీ లోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలతో పాటు దిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలకు బ్యాలెట్ పేపర్లు, ఓటు వేసే పెన్నులు, బ్యాలెట్ బాక్స్ ల పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది.

కొన్ని రాష్ట్రాలు సహా పూదుచ్చేరికి ఎన్నికల సామాగ్రిని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పంపారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పటికే సామాగ్రిని కేంద్ర ఎన్నికల సంఘం పంపింది. మిగిలిన రాష్ట్రాలకు త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం సామగ్రి పంపనుంది. 15వ తేదీ సాయంత్రం వరకు అన్ని రాష్ట్రాలకు పోలింగ్ సామాగ్రి చేరుతుంది. విమానాల్లో సాధారణ ప్రయాణికుడి తరహాలో టికెట్ తీసుకుని ఎన్నికల సామాగ్రిని కేంద్ర ఎన్నికల సంఘం పంపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: