ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌?

Chakravarthi Kalyan
ఏపీ నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వచ్చే నెలలో గ్రూప్1, గ్రూప్  2. ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మొత్తం 110పోస్టులతో  గ్రూప్1 నోటిఫికేషన్ రాబోతోంది. అలాగే  182 పోస్టులతో గ్రూప్  2నోటిఫికేషన్లు రాబోతున్నాయి. అలాగే జాబ్ కేలండర్ లో తెలిపి పెండింగ్ లో ఉన్న మరో 13 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని గౌతం సవాంగ్‌ తెలిపారు.


ఈ నెల 24న దేవాదాయ శాఖలో ఈవో పోస్టులకు రాత పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అలాగే  ఈ నెల 31 న రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆయన నిన్న 2018 గ్రూప్ 1 తుది ఫలితాలను విడుదల చేశారు. ఇటీవల నిర్వహించిన ఇంటర్వూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను  ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: