ఆ ఐపీఎస్పై మళ్లీ జగన్ సర్కారు సస్పెన్షన్ ?
ఆయనకు సీఎస్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు.అప్పటి వరకూ ఆ శాఖను పర్యవేక్షిస్తున్న జి.విజయ్కుమార్ను రిలీవ్ చేసింది. అయితే.. ఇంతలోనే మరోసారి ఏబీవీని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. అసలు ఈ కేసు పూర్వపరాలేంటంటే..
కొన్ని నెలల క్రితం పెగాసస్తో పాటు తన సస్పెన్షన్ అంశాలపై మీడియాతో ఏబీవీ మాట్లాడారు. అలా ఏబీవీ మీడియా సమావేశం నిర్వహించడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది. సీఎస్ సమీర్ శర్మ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. నోటీసు అందిన వారంలోపు వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని సీఎస్ ఇటీవలే హెచ్చరించారు. ఇంతలోనే ఏబీవీపై సస్పెన్షన్ వేటు పడింది కూడా.