సోనియా విచారణకు రెడీ అవుతున్న ఈడీ?
సోనియా గాంధీకి ఈనెల 2న కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత 10రోజులకు ఆమె వైరస్ అనంతర సమస్యలతో గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ముక్కు నుంచి రక్త స్రావం కావటంతో సోనియా గాంధీని ఆస్పత్రికి తరలించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ గతంలో చెప్పారు. ఊపిరితిత్తుల దిగువ భాగంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈడీ మాత్రం విచారణకు రంగం సిద్ధం చేసుకుంటోంది.