ఆ హక్కు ఎవరికీ లేదు.. గర్జించిన సాయిపల్లవి?

Chakravarthi Kalyan
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్ పండిట్స్ , గోహత్యలపై నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. విరాటపర్వం సినిమా ప్రమోషన్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. వీటిపై బాగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సాయిపల్లవి వ్యాఖ్యలపై  భజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థ నాయకులు మండిపడుతున్నారు.
దీంతో తనపై వస్తున్న విమర్శలపై కథానాయిక సాయిపల్లవి స్పందించింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేసింది సాయి పల్లవి. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తాను ఎవ్వరినీ కించ పరిచే విధంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చింది.

నా దృష్టి లో హింస అనేది మమ్మటికి తప్పే.. అంటున్న సాయి పల్లవి.. ఏ మతం లో నైనా హింస మంచిది కాదు అని గతం లోనే చెప్పానన్నారు. ఒక డాక్టర్ గా ప్రాణం విలువ నాకు తెలుసని.. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని సాయిపల్లవి అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: