మమతకు రాజ్‌నాథ్‌ ఫోన్‌ కాల్‌.. ప్లీజ్‌..?

Chakravarthi Kalyan
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఏకాభిప్రాయం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే వివిధ పార్టీల నేతలకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. ఆయన నిన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడారు. ఒక్క మమత తోనే కాదు.. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేతోనూ.. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌తో మాట్లాడారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక దృష్ట్యా పార్టీల మద్దతు కోరారు.

రాష్ట్రపతి ఎన్నికల పోటీలో అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు యత్నిస్తుండటంతో ఏకాభిప్రాయానికి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రయత్నిస్తున్నారు. అయితే విపక్షాల అభ్యర్థిపైమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ భేటీ నిర్వహించిన రోజే రాజ్‌నాథ్‌ ఫోన్‌ కాల్స్‌  చేయడం విశేషం. అవసరమైతే.. విపక్షాలు సూచించిన అభ్యర్థిని రాష్ట్రపతి రేసులో నిలిపేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే.. అసలు తమ అభ్యర్థి ఎవరో చెప్పకుండానే రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చలు ప్రారంభించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: