ఏంటిది జగన్.. ఎస్సీ కుర్రాడిని చంపితే పాలాభిషేకాలా?

Chakravarthi Kalyan
ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరాతకంగా చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకి వైసీపీ నేతలు పాలాభిషేకం చేయించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుబట్టారు. హంతకుడైన ఎమ్మెల్సీ అనంతబాబుకు జైల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు..అంతే కాకుండా అనంతబాబుకు బయట ఫ్లెక్సీల‌తో ఊరేగింపులు చూస్తుంటే ఎస్సీలపై సాగుతున్న దమనకాండ అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోందని లోకేశ్‌ విమర్శించారు.
ఎస్సీ యువ‌కుడ్ని అతి కిరాత‌కంగా చంపిన అనంత‌బాబుని హీరోగా కీర్తిస్తూ వైసీపీ ఊరేగింపు నిర్వహించ‌డం దారుణం అన్నారు. దీన్ని చూశాక‌ ఈ ప్రభుత్వంలో నిందితుల‌కు ర‌క్ష,  బాధితుల‌కు శిక్షేనని మరోసారి రుజువైందని లోకేశ్‌ విమర్శించారు. దళితుల్ని దారుణంగా చంపే వాళ్లకి ప్రమోషన్లే తప్ప సస్పెన్షన్లు ఉండవని జ‌గ‌న్‌ రెడ్డి తన పార్టీ లీడ‌ర్ల నుంచి కేడ‌ర్ వ‌ర‌కూ భ‌రోసా ఇస్తు న్నారని లోకేశ్‌ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: