భారత్‌ వీక్‌నెస్‌ బయటపెట్టిన అమెరికా నివేదిక?

Chakravarthi Kalyan
ఇండియా అనేక రంగాలలో దూసుకుపోతోంది. ప్రపంచంలోని అగ్ర రాజ్యాలకు పోటీ ఇస్తోంది. అయితే.. కొన్ని విషయాల్లో మాత్రం ఇండియా రికార్డు ఇంకా చెత్తగానే ఉంటోంది. అలాంటి ఓ విషయాన్ని ఇటీవల ఓ అమెరికా నివేదిక బయటపెట్టింది. అదేంటంటే.. ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ క్రైం బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉందట. అమెరికాకు చెందిన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఈ నివేదికను రూపొందించింది.

ఇంటర్నెట్‌ క్రైమ్‌ కంప్లయింట్‌ సెంటర్‌ ఇచ్చిన గణాంకాల ఆధారంగా ఎఫ్‌బీఐ ఈ నివేదిక రూపొందించిందట. ఈ ఎఫ్‌బీఐ నివేదిక ప్రకారం 2021లో అమెరికాలో 4,66,501మంది సైబర్‌క్రైం బాధితులుగా నమోదు అయ్యారట. ఆ తర్వాత స్థానం బ్రిటన్‌ది. అక్కడ సైబర్ క్రైమ్ బాధితుల సంఖ్య 3,03,949గా ఉందట. ఆ తర్వాత స్థానాల్లో కెనడా, ఇండియా ఉన్నాయట.  కెనడాలో 5788 మంది, భారత్‌లో 3131 మంది గతేడాది సైబర్ క్రైమ్ బారిన పడ్డారట. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సైబర్‌ క్రైం కేసులు నమోదవుతున్న కోణంలోనూ ఎఫ్‌బీఐ జాబితా రూపొందించింది. షాకింగ్ ఏంటంటే.. ఈ 20 దేశాల జాబితాలో పాకిస్థాన్‌, చైనా దేశాలు కూడా భారత్‌ తర్వాతే ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: