బ్రేకింగ్: పోలవరం పనుల్లో శివలింగం?
ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు కొందరు అక్కడికి వెళ్లి శివలింగాన్ని పరిశీలించారు. శివలింగం పూర్తిగా మట్టితో నిండి ఉంది. దీన్ని శుభ్రం చేశారు. తవ్వకాల వల్ల శివ లింగం కాస్త బీటలు వారింది. గతంలో గోదావరి నదీ తీర ప్రాంతంలో పలు చోట్ల శివాలయాలు ఉండేవి. వరదల వల్ల అవి కనుమరుగు అయ్యాయి. అలాంటి వాటిలో నుంచే ఈ లింగం ఉండి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. పోలవరం పనుల్లో శివ లింగం బయటపడటం శుభ శకునంగా భావిస్తున్నారు.