జగన్‌.. మూడేళ్లవుతోంది.. ఒక్క రూపాయి ఇచ్చారా?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ ఎస్సీలను అస్సలు పట్టించుకోవడం లేదని ఎస్సీలు ఆరోపిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటుతున్నా ఎస్సీ కార్పొరేషన్ కి ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయలేదంటున్నారు. ఎస్సీ నిధులను ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజక అభివృద్ధికి వినియోగించారని ఎస్సీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వాలు కేటాయించిన 36 సంక్షేమ పథకాలను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశారని ఎస్సీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్ సర్కారు తీరుకు నిరసనగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర ఎస్సి కార్యాలయాన్ని ముట్టడించేందుకు భారతీయ జనతా పార్టీ  రాష్ట్ర ఎస్సీ నేతలు ప్రయత్నించారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే.. ఎస్సీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే అన్ని రహదారులలో బారికేడ్లు  పెట్టి తనిఖీలు నిర్వహించి అడ్డుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: