జగన్.. మూడేళ్లవుతోంది.. ఒక్క రూపాయి ఇచ్చారా?
జగన్ సర్కారు తీరుకు నిరసనగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర ఎస్సి కార్యాలయాన్ని ముట్టడించేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ నేతలు ప్రయత్నించారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే.. ఎస్సీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే అన్ని రహదారులలో బారికేడ్లు పెట్టి తనిఖీలు నిర్వహించి అడ్డుకున్నారు.