రెండు హత్యలు.. రూ.40 కోట్లు- బెడిసికొట్టిన ప్లాన్‌?

Chakravarthi Kalyan
ఆ ఇద్దరిని చంపేస్తే.. ఏకంగా రూ.40 కోట్లు వశం చేసుకోవచ్చు.. ఓ డ్రైవర్ పన్నిన కుట్ర ఇది. డబ్బు, బంగారం కోసం సొంత యజమాని, ఆయన భార్యనే చంపేందుకు వెనుదీయని ఓ డ్రైవర్ కథ ఇది. ఈ హత్యలు తమిళనాడులో జరిగాయి. చెన్నైకి చెందిన శ్రీకాంత్, అనురాధ దంపతులు ఇటీవల అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడి నుంచి ఇటీవల ఇండియాకు వచ్చారు. నేపాల్ కు చెందిన కృష్ణ వారి వద్ద పదేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్ వద్ద రూ.40 కోట్లు డబ్బు ఉందని కృష్ణ భావించాడు. స్నేహితుడు రవితో కలిసి దంపతులను తలపై కర్రలతో కొట్టి హత్యచేశాడు. అనంతరం మృతదేహాలను ఫామ్ హౌజ్ లో పాతి పెట్టారు. ఈ ఘటనలైప కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ కాల్స్, కారు ఫాస్టాగ్ వివరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. కృష్ణ, రవిలను ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 కిలోల బంగారం,  5కోట్ల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: