ఇవాళ కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్‌ యాత్ర

Chakravarthi Kalyan
జనసేనాని పవన్ కల్యాణ్‌ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ ఆత్మహత్యలకు పాల్పడిన  కౌలు రైతుల కుటుంబాలను జనసేనాని పవన్ కల్యాణ్‌ పరామర్శి‌స్తారు. వారికి భరోసా ఇచ్చేందుకు ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.

కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఈ ఉదయం 9 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రమానికి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఆళ్లగడ్డ నియోజకవర్గం, శిరివెళ్ళ గ్రామం వెళ్తారు. అక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరి వెళ్తారు. మార్గ మధ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. వారికి జనసేనాని పవన్ కల్యాణ్‌  చెక్కులు అందచేస్తారు. ఈ మధ్యాహ్నం గం. 2 : 30 నిమిషాలకు జనసేనాని పవన్ కల్యాణ్‌ శిరివెళ్ళ చేరుకుంటారు. అక్కడ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు అందచేసి సభను ఉద్దేశించి జనసేనాని పవన్ కల్యాణ్‌ ప్రసంగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: