ఏడాది పూర్తి: కొత్త స్కీములతో అదరగొడుతున్న స్టాలిన్‌?

Chakravarthi Kalyan
తమిళనాట సీఎం స్టాలిన్‌ పవర్‌లోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఐదు కొత్త పథకాలు ప్రకటించారు. ఇకపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం ఇవ్వబోతున్నారు. అలాగే తెలంగాణ, దిల్లీ తరహాలో అర్బన్‌ క్లీనిక్‌లు ఏర్పాటు చేస్తారు.  అలాగే
దిల్లీ తరహాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేస్తారు.. అలాగే నియోజకవర్గంలో సీఎం నిధులు అందిస్తారు.

సామాజిక న్యాయంతో కూడిన ద్రవిడ నమూనా పాలన అందిస్తామని స్టాలిన్ అంటున్నారు. ఏడాదికాలంలో డీఎంకే ప్రభుత్వం చేసిన పనులను తమిళనాడు సీఎం స్టాలిన్‌ శాసనసభలో ప్రసంగంలో తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 60నుంచి 70శాతం వరకు పూర్తి చేశామన్నారు. ఏడాది కాలంలో ఎంత చేయాలో అంతకంటే ఎక్కువగానే చేశామన్నారు స్టాలిన్. కేంద్రం నుంచి సహకారం లేక కొన్ని చేయలేకపోయామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: