జగన్‌ను ఉరి తీయాలి.. అచ్చెన్న షాకింగ్‌ కామెంట్‌?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్‌ను ఉరి తీయాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో ఓ పార్టీ కార్యక్రమంలో ప్రసంగించిన అచ్చెన్నాయుడు.. ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. దిక్కుమాలిన దిశ చట్టంతో ఒక్కరికి కూడా శిక్ష పడలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అదే ఆవేశంలో ఇలాంటి  దిశ చట్టంతో మోసం చేస్తున్న సీఎంను ఉరి తీయాలని ఆవేశంగా అన్నారు. లేని చట్టాన్ని ఉందంటూ మహిళలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రిపై చీటింగ్‌ కేసు పెట్టి ఉరి తీయాలని  అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం ఆసక్తి కలిగించింది. ఏపీ రాష్ట్రంలో మూడేళ్లలో 800 మందిపై అత్యాచారాలు జరిగాయన్న అచ్చెన్నాయుడు..ఏపీలో అమలులో లేని చట్టం పేరుతో మోసగిస్తున్న సీఎంను శిక్షించాలని డిమాండ్ చేసారు. 2019 ఎన్నికల్లో ఓ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చారని జగన్‌ను ఉద్దేశించి మాట్లాడిన అచ్చెన్నాయుడు... వైఎస్‌ జగన్ తాత, తండ్రి వచ్చినా టీడీపీని  ఏమీ చేయలేరన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: