గుజరాత్‌కు బ్రిటన్ ప్రధాని? ఎందుకంటే?

Chakravarthi Kalyan
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇండియాకు రాబోతున్నారు. ఆయన భారత పర్యటన ఖరారు అయ్యింది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్  ఈ నెల 21న ఇండియాకు రాబోతున్నారు. ఆయన గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకుంటారు. ఆ తర్వాత రోజు దేశ రాజధాని దిల్లీలో ఆయన బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పర్యటిస్తారు.
అయితే.. ఇండియా వచ్చిన ఏ విదేశీ నేత అయినా.. ముందు దిల్లీ వచ్చాక ఇండియాలో ఎక్కడికైనా వెళ్తారు. కానీ.. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇప్పుడు నేరుగా గుజరాత్ లో బోరిస్ దిగుతున్నారు. ఇలా ఆ ప్రాంతానికి వెళ్లనున్న తొలి బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ చరిత్రలో ఎక్కబోతున్నారు. గతంలోనే ఆయన ఇండియాకు రావాలనుకున్నా.. కరోనా వల్ల పర్యటన వాయిదా పడింది. ఇప్పడు మోదీ, బోరిస్.. ఉద్యోగాల సృష్టి, ఆర్థిక వృద్ధి, రక్షణ, ఇంధన రంగాల్లో భద్రత వంటి అంశాలపై చర్చిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: