కీలకం.. హిజాబ్ కేసులో ఇవాళే తీర్పు
దక్షిణ కర్ణాటకలో విద్యా సంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కళాశాలల్లో జరిగే అంతర్గత పరీక్షలను కూడా అధికారులు వాయిదా వేశారు. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో హిజాబ్ వివాదం పెద్ద గొడవలకు దారి తీసింది. ముస్లిం యువతులు హిజాబ్ ధరిస్తే.. తాము కాషాయ కండువాలు ధరించి వస్తామని హిందూ విద్యార్థులు గొడవ చేశారు. ఈ అంశం చివరకు కోర్టుకు ఎక్కింది. దీనిపై కోర్టు తీర్పు ఏం వస్తుందో చూడాలి.